ఈ నెల 21న విడుదల కాబోతున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ లో జరిగింది.. స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి శృతి శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి మార్క్ కె రాబిన్ సంగీతం. ఈ  వేడుకకు ముఖ్య అతిథిగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ ఈవెంట్‌కు మెగా హీరో రావడం అటు మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులకు ఆనందాన్ని కలగజేసింది.


చిత్రలహరి సూపర్ హిట్ అందుకున్న తర్వాత మెగా హీరో త్వరలో ప్రారంభం కాబోయే 'ప్రతిరోజు పండగే' సినిమాకు రెడీ అవుతున్నాడు. మారుతీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్ ని రెడీ చేసి పెట్టారు. ఇక మెగా హీరో ఫ్రెష్ న్యూ లుక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మొదటి నుంచి సాయి తేజ్ ఒక్కో సినిమాకు ఒక్కో డిఫ్రెంట్ మేకోవర్‌తో స్క్రీన్ పై ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు.


ఇక యూత్ నుండి వస్తున్న ఏజెంట్ ఆత్రేయ ఇప్పటికే ట్రైలర్ రూపంలో మంచి స్పందన దక్కించుకుంది. కామెడీతో సాగుతూనే సీరియస్ టర్న్ తీసుకునే స్పై థ్రిల్లర్ సినిమాగా ఆత్రేయ ను రూపొందించారు. ఇక సాయి తేజ్ ప్రీ రీలిజ్ ఈవెంట్ కి రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఇంకా ఆసక్తి పెరిగింది. అదే రోజు చిన్న సినిమాల మధ్య పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ ఇది మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు స్వరూప్. నెల్లూరులో ఉండే ఓ ప్రైవేట్ డిటెక్టీవ్ తన స్థాయికి మించిన కేసు వచ్చినప్పుడు దాన్ని తనదైన శైలిలో ఎలా డీల్ చేసాడనే పాయింట్ తో ఈ ఏజెంట్ ఆత్రేయ తెరకెక్కించాడు. మరి రేపు థియోటర్లలోకి వచ్చాక ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: