తమిళ దర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో  న‌ట‌సింహం నందమూరి బాల‌కృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.  ఈ సినిమాకి 'క్రాంతి' అలాగే 'రూలర్' అనే టైటిల్స్  ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.  ఐతే ఈ సినిమాలో  ఇద్దరు హీరోయిన్స్ కి  అవకాశం ఉండగా  ఒక హీరోయిన్ గా శ్రీయా శరణ్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య పక్కన పలు చిత్రాల్లో ఆడిపాడింది ఈ ముదురు భామ.  అయినా బాలయ్య  మాత్రం ఇప్పట్లో  ఈ హీరోయిన్ ను వదిలేలా లేడు. 


 గతంలో బాలకృష్ణ  సరసన  శ్రీయా మొదటిసారిగా "చెన్నకేశవ రెడ్డి" మూవీలో నటించగా ఆ తరువాత  "గౌతమీ పుత్ర శాతకర్ణి", "పైసా వసూల్" చిత్రాల్లో కూడా  కలిసి నటించింది.    ఇక  ఈ చిత్రంలో  బాలయ్య  పాత్రను  చాలా ఎమోషనల్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ మొత్తం మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు  సెంటిమెంటల్ గా సాగుతుందట.       


ఇక ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు  పవర్ ఫుల్ విల‌న్‌ పాత్రలో  న‌టించ‌బోతున్నారు.   ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు.   సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.  జులై  నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: