తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమాకి 'క్రాంతి' అలాగే 'రూలర్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఐతే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉండగా ఒక హీరోయిన్ గా శ్రీయా శరణ్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య పక్కన పలు చిత్రాల్లో ఆడిపాడింది ఈ ముదురు భామ. అయినా బాలయ్య మాత్రం ఇప్పట్లో ఈ హీరోయిన్ ను వదిలేలా లేడు.
గతంలో బాలకృష్ణ సరసన శ్రీయా మొదటిసారిగా "చెన్నకేశవ రెడ్డి" మూవీలో నటించగా ఆ తరువాత "గౌతమీ పుత్ర శాతకర్ణి", "పైసా వసూల్" చిత్రాల్లో కూడా కలిసి నటించింది. ఇక ఈ చిత్రంలో బాలయ్య పాత్రను చాలా ఎమోషనల్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ మొత్తం మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సెంటిమెంటల్ గా సాగుతుందట.
ఇక ఈ చిత్రంలో జగపతిబాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జులై నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.