ఇటీవల తన కెరియర్ లో 25వ సినిమా మహర్షి సినిమా విడుదల చేసి భారీ బ్లాక్ బస్టర్ ని కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు సీనియర్ హీరోయిన్ నటి విజయశాంతి కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా యూరప్ హాలిడే ట్రిప్ తర్వాత ఇండియాకు వచ్చిన మహేష్ బాబు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు.మహేష్ నటించిన ఒక్కడు, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి.


ఇతర భాషల్లో విజయం సాధించిన చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశం వస్తే చేస్తారా అని ప్రశ్నించగా.. రీమేక్ చిత్రాల్లో నటించడం తనకు ఇష్టం లేదని లైఫ్ లో అటువంటి సినిమా అవకాశాలు వచ్చినా చేయను అని మహేష్ బాబు తేల్చి చెప్పేశాడు. ఇక బాలీవుడ్ లో నటించే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన ఫోకస్ మొత్తం తెలుగు సినిమాపైనే అని మహేష్ తెలిపాడు. 1999లో మహేష్ హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు విడుదలయింది.


ఈ 20 ఏళ్లలో కేవలం 25 సినిమాల్లో మాత్రమే నటించారు అని ప్రశ్నించగా.. తనకు హడావిడిగా సినిమాలు చేయాలనే ఉద్దేశం లేదని, సినిమా నిర్మాణంలో క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం అని మహేష్ అభిప్రాయపడ్డాడు. తన పిల్లల విషయంలో తాను గారాబం చూస్తుంటానని, నమ్రత మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటుందని తెలిపాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: