దక్షిణాది హీరోయిన్ అమలా పాల్ స్పీడ్ అత్యంత సంచలనంగా మారింది. జాతీయ స్థాయి ఉత్తమనటి అవార్డ్ అందుకుని ఆతరువాత దర్శకుడు విజయ్ ని పెళ్ళి చేసుకుని విడిపోయింది. ఆపై తిరిగి సినిమా నటన విషయంలో యూటర్న్ తీసుకున్న ఈమె ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు అనేకం సంచలనంగా మారుతున్నాయి. 

బోల్డ్ సీన్స్ లో హాట్ గా నటించడం ఆపై వివాదాలలో చిక్కుకోవడం ఆమెకు కొత్త కాదు. వివాదాలు వస్తున్న కొద్ది ఆమె పాపులారిటీ పెరిగి పోతోంది. లేటెస్ట్ గా అమలా పాల్ నటించిన 'ఆమె' టీజర్ తో మరోసారి సంచలనం సృష్టించింది.  ఈ సినిమా టీజర్ ను బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ విడుదల చేసాడు. 

ఈ టీజర్ మొదలుకాగానే ఒక  అమ్మతో పోలీస్ "ఇంకో రోజు వెతికి ఉండాల్సింది కదా?  మీ అమ్మాయి కనిపించడం లేదని నువ్వు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చేయడమేనా? అసలు అమ్మాయికోసం వెతికారా?" అని అడుగుతాడు. దీనికి సమాధానంగా ఆవిడ "అమ్మాయితో నేను చివరిసారిగా ఫోన్ లో  మాట్లాడినపుడు అమ్మాయి మద్యం మత్తులో ఉంది" అని సమాధానం చెప్తుంది.  

ఈ సీన్ తర్వాత సస్పెన్స్ పెంచుతూ  ఖాళీగా ఉండే ఒక పెద్ద బిల్డింగ్ ను చూపెడుతూ రక్తపు మడుగులో పడిపోయిన ఒక వ్యక్తిని చూపెడుతూ నగ్నంగా కనిపిస్తున్న అమలా పాల్ ను చూపెట్టారు. ప్రస్తుతం ఈ టీజర్ పెను ప్రకంపనాలను సృష్టిస్తోంది. గతంలో బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే లాంటివారు ఇలాంటి బోల్డ్ సీన్స్ లో నటించినా ఒక దక్షిణాది హీరోయిన్ ఇలాంటి సీన్స్ లో నటించడం అత్యంత సంచలనంగా మారింది. డ్రగ్స్ కు బానిస అయిన ఒక అమ్మాయి చుట్టూ ఈసినిమా కథ అల్లబడినట్లు సమాచారం. రత్నకుమార్ దర్శకత్వం వహించిన ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: