మహేష్ 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ మే 31 వ తేదీన ప్రారంభమైంది.  రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నది.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నది.  విజయశాంతి అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలదని భావించిన అనిల్, నిర్మాత దిల్ రాజుకు చెప్పాడట.  

దాదాపు 13 సంవత్సరాలుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు.  రాజకీయాల్లో బిజీ అయ్యారు.  తెలంగాణకు చెందిన మహిళ కావడంతో.. దిల్ రాజు అడిగితె కాదనదేమో అని చెప్పి.. రాజు ద్వారా అప్ప్రోచ్ అయ్యారు.  పైగా ఈ సినిమాకు దిల్ రాజు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు.  పాత్ర కీలకం కావడంతో.. ఆమె అడిగినంత ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.  అనుకున్నట్టుగానే ఆమె అడిగినంత ముట్టజెప్పారని వినికిడి.  

ఈ డీల్ అనంతరం ఆమె ఒకే చెప్పింది.  మహేష్ తో సినిమా చేయడం హ్యాపీగా ఉందని పేర్కొంది.  చాలాకాలం తరువాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నది కాబట్టి ఫిట్నెస్ కోసం ప్రతిరోజూ కసరత్తులు చేస్తున్నది.  సో, సినిమా కోసం మళ్ళీ విజయశాంతి తన లుక్ ను మార్చుకోబోతున్నది.  ఈ సినిమా తరువాత ఆమెకు వరసగా ఆఫర్లు వస్తాయి అనడంలో సందేహం అవసరం లేదు.  

విజయశాంతి సినిమాల్లోకి తిరిగి అడుగుపెట్టింది అనే విషయం తెలిసిన చాలామంది దర్శక నిర్మాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  త్వరలోనే మరో కొన్ని పెద్ద సినిమాలు చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  సో, సెకండ్ ఇన్నింగ్స్ విజయశాంతికి ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: