దర్శకుడు తేజ చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. ఆయన సినిమాల్లో దాదాపుగా కొత్తవాళ్ళే ఎక్కువగా ఉంటారు. అలా ఆయన సినిమా ద్వారా వచ్చి ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరీ నితిన్ ని " జయం " ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. హీరోయిన్ సదా, నవదీప్, కమెడియన్ సుమన్ శెట్టి మొదలగు వారు తేజ సినిమాల ద్వారానే ఇండస్ట్రీలోకి వచ్చారు.

 

"జయం " సినిమాలో కమెడియన్ గా చేసిన సుమన్ శెట్టికి ప్రస్తుతం అవకాశాలు లేవట. జయం తర్వాత ఆయన చాలా సినిమాల్లో కనిపించారు.  బృందావన కాలనీ లాంటి సినిమాల్లో స్నేహితుడి పాత్రలు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం  ఇండస్ట్రీలో కొత్త వాళ్ళ తాకిడి ఎక్కువ ఉండడంతో,  చాలా మంది నటులకి అవకాశాలు రావట్లేదు.

 

అదే గాక తెలుగు సినిమాలో చాలా మార్పులొచ్చాయి. కామెడి ప్రధానంగా వచ్చే సినిమాలు రావట్లేదు. అందుకని చాలా మంది కమెడియన్లు పని లేక ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు. దర్శక నిర్మాతలు ఫుల్ లెంగ్త్ కామెడి  సినిమాల్తో ముందుకు రాకపోవడం వల్ల నటులు ఖాళీ గా ఉంటున్నారు. ఇటీవల సుమన్ శెట్టీ "ఆలీ తో జాలీగా" ప్రోగ్రాం కి వచ్చాడు. అక్కడ చాలా విషయాలు మాట్లాడాడు.

 

"కొత్తవాళ్ల పోటీ ఎక్కువగా ఉండటం వలన, తన్కి  అవకాశాలు తగ్గుతూ వచ్చాయి, నిజం చెప్పాలంటే తనకు నటన తప్ప మరొకటి తెలియదు. కెమెరా ముందు నటించడం తప్ప మరే పని చేయలేను. నటననే నమ్ముకుని .. ఇప్పటివరకూ దీనిపైనే ఆధారపడి బతికాము. నటుడిగా నాలో లోపాలేమైనా వుంటే సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా వున్నాను. దర్శక నిర్మాతలు మా పరిస్థితిని అర్థం చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించాలి" అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: