తమిళం లో దర్శకుడు రత్నకుమార్  రూపొందిస్తోన్న  ఆడై చిత్రాన్ని తెలుగు లో ఆమె పేరిట అనువదిస్తున్నారు. ఈ సినిమా ను దర్శకుడు  బోల్డ్ కంటెంట్ తో రూపొందిస్తున్నాడు. ఈ సినిమా లో  అమలాపాల్ హీరోయిన్ గా  నటించింది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ విడుదల చేశాడు. టీజర్ చూసిన పలువురు సినీ ప్రముఖులు, బోల్డ్ కంటెంట్ లో నటించిన  అమలాపాల్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.


ఈ సినిమా టీజర్ లో కూతురు కన్పించడం లేదని ఒక తల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు ఆమె కూతుర్ని వెత్తుకుంటూ ఒక పెద్ద బిల్డింగ్ కు వెళ్తారు. అక్కడ అమలాపాల్ కన్పిస్తుంది కానీ ఆమె ఒంటి పై నూలు పోగు కూడా ఉండదు. టాలీవుడ్ లో మెగా హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్ సరసన నటించిన అమలాపాల్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది.


విజయ్ తో విడిపోయిన తరువాత మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్ అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడడం లేదు. తాజాగా ఆమె నటించిన బోల్డ్ కంటెంట్ సినిమా కోసం సాధారణ ప్రేక్షకులే కాదు ... హీరోయిన్ సమంత లాంటి వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా సమంతానే ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: