చాలా మంది నటులు అటు సినిమాలు చేస్తూ, అప్పుడప్పుడు  సినిమాలు నిర్మించడం చూస్తుంటాం. వాళ్ళకి బాగా నచ్చిన కథ ఏదైనా ఉంటే దాన్ని వాళ్ళె నిర్మించడానికి కూడా సిద్ధపడతారు. అలా కొత్త కథల్ని నిర్మించి వాళ్ల అభిరుచిని తీర్చుకుంటారు. తాజా గా ఇలా హీరోయిన్ నిర్మాతగా మారనుందట. దర్శకుడు తేజ "లక్ష్మీ కళ్యాణం" సినిమా ద్వారా వెండితెర కి పరిచయం చేసాడు.

 

ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ కాజల్ కి మాత్రం అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. క్రిష్ణ వంశీ దర్శకత్వం లో వచ్చిన  చందమామ సినిమాతో నటిగా మంచి పేరొచ్చింది. " రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "మగధీర" ఆమె కెరీర్ నే మార్చివేసింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు.

 

దాదాపు దశాబ్దం పైగా ఇండస్ట్రీ లో ఉంటుంది. బాలీవుడ్ లో కూడా రెండు మూడు సినిమాల్లో నటించింది. కానీ తనకి తెలుగు ఇండస్ట్రీ అంటేనే అభిమానం ఎక్కువ అని చాలా సార్లు చెప్పింది. పెద్ద పెద్ద స్టార్స్ పక్కన నతించింది. మొన్న వచ్చిన "సీత" సినిమాలోని ఆమె పాత్రకి బాగా పెరొచ్చింది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు కాజల్  నిర్మాతగా మారనుందట.

 

తనకి మొదటిసారి అవకాశం ఇచ్చిన తేజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడట. తెలుగు తెరకి పరిచయం చేసిన కృతజ్ఞతతో ఆయన దర్శకత్వంలోనే తొలి సినిమాను నిర్మించాలని ఆమె ప్లాన్ చేసుకుంటోందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా కాజల్ కనిపించనుందట. హీరోయిన్ గా విజయం సాధించిన కాజల్ నిర్మాతగా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: