ఆగష్టు 15న విడుదల కాబోతున్న ‘సాహో’ మూవీ పై ప్రభాస్ అభిమానులు పెంచుకున్న కొన్ని ఆశలకు బాలీవుడ్ ఆధిపత్యం సమస్యగా మారింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీ హిందీ రైట్స్ ను 120 కోట్లకు తీసుకున్న టి సిరీస్ సంస్థకు ఈమూవీ ప్రమోషన్ విషయాలను కూడ అప్పచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 

జాతీయ స్థాయిలో ఈమూవీ ప్రమోషన్ పై సుమారు 25 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇప్పటికే టి సిరీస్ సంస్థ భారీ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ ఆద్వర్యంలోని ‘సాహో’ ప్రమోషన్ కు సంబంధించిన ఆడియో ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తూ వాటిలో భాగంగా మన తెలుగు రాష్ట్రాలలో కూడ నిర్వహిస్తారని తెలుస్తోంది. 

అయితే సినిమా ప్రమోషన్ విషయంలో బాలీవుడ్ అనుసరించే పద్ధతులు టాలీవుడ్ అనుసరించే పద్దతులు చాల తేడాగా ఉంటాయి. ముఖ్యంగా సినిమా ఈవెంట్స్ ను భారీ జనం మధ్య ఓపెన్ గ్రౌండ్స్ లో బాలీవుడ్ సినిమా ఫంక్షన్స్ జరగవు. అయితే మన టాప్ హీరోల సినిమాల ఫంక్షన్స్ భారీ గ్రౌండ్స్ లో జనం మధ్య జరిగినప్పుడు మాత్రమే అభిమానులకు కిక్ వస్తుంది. 

దీనితో ‘సాహో’ మూవీ ప్రమోషన్ ఫంక్షన్స్ ను జనం మధ్య తిరుపతిలో కాని లేదంటే విశాఖపట్నంలో కానీ భారీ ఎత్తున నిర్వహిస్తారు అని కలలు కంటున్న ప్రభాస్ అభిమానుల కోర్కను టి సిరీస్ సంస్థ పట్టించుకోదేమో అన్న భయంలో ప్రభాస్ అభిమానులు ఉన్నట్లు టాక్. దీనితో ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను బాలీవుడ్ కు చెందిన ప్రధాన నగరాలలో ఎలా నిర్వహించినా తెలుగు రాష్ట్రాలలో మటుకు మన పద్ధతి ప్రకారం భారీ గ్రౌండ్స్ లో జనం మధ్య నిర్వహించి తీరాలి అని ప్రభాస్ అభిమానులు వేల సంఖ్యలో ప్రభాస్ కు తమ అభ్యర్ధనలను మెసేజ్ లు చేస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: