మరాఠీ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు మలింద్ దస్తానే. ఎన్నో టీవీ సీరియల్స్ లో ఆయన నటించారు.. ప్రస్తుతం 'తుజ్యత్ జీవ్ రంగ్లా' అనే టీవీ సీరియల్ లో నటిస్తున్నాడు.  తాజాగా  మిలింద్ దస్తానే, అతడి భార్యని  పూణే పోలీసులు అరెస్ట్ చేశారు.  ఓ అభరణాల దుకాణాన్ని రూ. 25 లక్షలకు దారుణంగా మోసం చేసిన ఘటనలో ఆయను అరెస్ట్ చేశారు. 

వివరాల్లోకి వెళితే.. తన భార్య సయ్యాలీతో కలిసి, వజ్రపు ఉంగరాన్ని, బంగారాన్ని కొనుగోలు చేయాలంటూ పుణెలోని పీఎన్ గాడ్గిల్ అనే నగల షాప్ లో కొనుగోలు చేశారు.  ప్రస్తుతం తన వద్ద అంత మనీ లేదని క్రెడిట్ కార్డ్ ద్వారా పాతిక లక్షలు చెల్లిస్తామని చెప్పారు. పేరున్న వ్యక్తి కావడంతో అందుకు ఆభరణాల దుకాణం యజమాని అంగీకరించాడు.  కొద్ది రోజుల తర్వాత నగల వ్యాపారి మలింద్ ని కాంటాక్ట్ చేయగా.. ముంబైలో ఒక ప్రాపర్టీను అమ్మకానికి పెట్టానని, అది అమ్ముడవ్వగానే పాతిక లక్షలు వడ్డీతో సహా చెల్లిస్తానని మిలింద్ చెప్పడంతో నగల షాప్ యాజమాన్యం కొన్నిరోజులు గడువిచ్చారు.

ఎన్ని రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వలేదని చతుర్ శృంగి పోలీస్ స్టేషన్ ను పీఎన్ గాడ్గిల్ జువెల్లరీ స్టోర్ ఆశ్రయించారు.  దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 406 ల కేసుల కింద కేసు నమోదు చేసి మిలింద్, అతడి భార్యని అరెస్ట్ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వీరికి జూన్ 21 వరకూ రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించడంతో జైలుకు తరలించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: