బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా విగ్రహం మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టనున్నారు. ఈ మేరకు మేడం టుస్సాడ్స్ బృందం ప్రియాంకకు తెలియజేయడం జరిగింది . కాగా నిక్ జోన్స్ తో పెళ్లి తరువాత ప్రియాంక అమెరికా లోని న్యూయార్క్ నగరంలో స్థిరపడ్డారు. ఆమె అక్కడే ఉంటూ హాలీవుడ్ చిత్రాలలో ,టీవీ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. దీనితో మేడం టుస్సాడ్స్ బృదం న్యూ యార్క్ వెళ్లి ఆమె శరీర కొలతలు తీసుకున్నారట. 2018 నుండి దీనిపై కసరత్తు జరుగుతుందని సమాచారం.


ఈ విగ్రహం 2017లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో ఆమె ధరించిన బంగారు వన్నెలో ఉండే లాంగ్ గౌన్ డ్రెస్ లో ఉంటుందట. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ మేడం టుస్సాడ్స్ బృదంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది, నాకు వారిచ్చిన ఈ గౌరవానికి ధన్యవాదాలు అని తెలిపారు. టాలీవుడ్ నుండి మహేష్,ప్రభాస్ ల విగ్రహాలను మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: