యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న థియేటర్లలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ ఏకంగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లకు అటు ఇటుగా ఉన్నట్టు తెలుస్తుంది.
థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి సాహో రూ. 500 కోట్లు బిజినెస్ చేస్తుందట. థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ. 320 కోట్ల రూపాయలు అన్ని భాషల్లో కలిపి చేయగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి మరో రూ.200 కోట్లు వరకు చేసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఏరియాల వారీగా ' సాహో ' బిజినెస్ ఇలా ఉంది... ( రూ.కోట్లలో)
ఏపీ / తెలంగాణా : 120
కర్ణాటక : 29
నార్త్ ఇండియా : 100
తమిళనాడు & కేరళ : 25
ఓవర్సీస్ : 45
-------------------------------------
టోటల్ వరల్డ్ వైడ్ : 320 కోట్లు
-------------------------------------