జగన్ ఇపుడు సీఎం. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన బంపర్ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రిగా కొలువుతీరారు. జగన్ మీద విమర్శలు చేయడానికి పచ్చ దళం కాచుకుని కూర్చున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో అయితే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావాలనే జగన్ జైల్ కెళ్ళిన సంగతి ఎత్తి బాగా కెలికారు.


ఇపుడు మరో కొత్త కధ మొదలెట్టారు. జగన్ బాలయ్యబాబు ఫ్యాన్ అన్నది ఆ కధ. దీనికి ఇదిగో సాక్ష్యం  అంటూ ఒక ఫేక్ పిక్ ని కూడా బయటపెట్టారు. ఈ రోజుల్లో ఎవరు ఎవరుతోనైన కలిపేసి ఫేక్ పిక్స్ పెట్టడం చాలా సులువు.అయితే ఇలా చేసి గత రెండు రోజులుగా బాలయ్యకు జగన్ గ్రీట్స్ చెబుతున్నట్లుగా పిక్స్ పెట్టి తెగ వైరల్ చేసిన పచ్చ దళం ఇక్కడే పప్పులో కాలేసింది.


అయితే అందులో వాడిన బాలకృష్ణ స్టిల్ అయితే సమర సింహారెడ్డిదే వాడారు కానీ - జగన్ మోహన్ రెడ్డి ఫొటోనే కొంచెం లేటెస్టుది వాడారు. వాస్తానికి ఆ ఫొటోలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే లేరు. ఆ అసలు పిక్ లో భార్య భారతి కూడా ఉంటారు. ఆ ఫొటో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాకా తీయించుకున్నది లాగా ఉంది.


 ఆ ఫొటో జగన్ కు పెళ్లయ్యాకా - ఏ పదిహేనేళ్ల కిందటో తీయించుకున్న ఫొటోలోగా ఉండగా - దాన్ని కట్ చేసి - ఎడిట్ చేసి - పేపర్లో అచ్చు అయినట్టుగా పేస్ట్ చేశారు దీంతోనే ఇపుడు వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రివర్స్ కౌంటర్లేస్తున్నారు. మొత్తానికి ఈ దుమారం ఆగేలా లేదుగా.



మరింత సమాచారం తెలుసుకోండి: