‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మ్యానియా పెరిగి పోవడంతో అనేక ప్రముఖ నిర్మాణసంస్థలు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి కనపరుస్తూ  భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తున్నాయి.  అయితే ఆ ఆఫర్లకు స్పందించకుండా ప్రభాస్ తన సొంత నిర్మాణ సంస్థలలోనే సినిమాలు చేస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థుతులలో దిల్ రాజ్ ఒక యంగ్ డైరెక్టర్ ను ప్రభాస్ దగ్గరకు తీసుకువెళ్ళి ఈమధ్య చెప్పిన కథకు ప్రభాస్ పూర్తిగా పడిపోయినట్లు టాక్. అయితే ‘సాహో’ రిజల్ట్ వచ్చే దాకా ఆగమని ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ ఇస్తాను అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు దిల్ రాజ్ ఆ యంగ్ డైరెక్టర్ ద్వారా చెప్పించిన కథ ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుందని టాక్. కథ స్వభావరీత్యా చాల సింపుల్ గా కనిపించినా ఆకథలో చాల ట్విస్ట్ లు ఉన్నట్లు సమాచారం. 

తాను నటించే ప్రతి సినిమాకు బడ్జెట్ విపరీతంగా పెంచుకుంటూపోతే ఆతరువాత అనేక సమస్యలు ఏర్పడి తన కెరియర్ కు సమస్యగా మారుతుంది కాబట్టి ప్రభాస్ భవిష్యత్ లో తాను నటించే సినిమాలకు ఇక బడ్జెట్ పెంచకూడదు అని భావిస్తున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ దిల్ రాజ్ చెప్పించిన కథకు సూత్ర ప్రాయంగా అంగీకరించినా ‘సాహో’ ఫలితం బట్టి ప్రభాస్ ఆలోచనలలో మరిన్ని మార్పులు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: