ఒకరకంగా చెప్పాలంటే యంగ్ హీరో నిఖిల్ జోరు బాగా తగ్గిందనే చెప్పాలి. సంవత్సరానికొక సినిమా కూడా సరిగ్గా రావడం లేదు. కిర్రాక్ పార్టీ తర్వాత ఇంతవరకు నిఖిల్ సినిమా థియోటర్స్‌లోకి రానేలేదు. లేటెస్ట్ సినిమా అర్జున్ సురవరం ఎప్పుడో విడుదల కావాల్సి వుంది. కానీ చిన్న సమస్య కారణంగా ఆలస్యమై, ప్రస్తుతం డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు చిత్ర బృందం. అయితే ఈ సినిమా ఇలావుంటే, ఈ మధ్య నిఖిల్ బర్త్ డే సందర్భంగా కార్తికేయ 2 అనౌన్స్ చేసారు. చందు మొండేటి దర్శకత్వం లో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించనుందని అప్డేట్ ఇచ్చారు.


అయితే ఈ సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశం లేదని తాజా సమాచారం. అయితే దీనికి కారణం ఏవేవో అనుకుంటున్నారు. కానీ అసలు కారణం దర్శకుడు చందు ఇంకా పూర్తి స్క్రిప్ట్ నెరేషన్ ఇవ్వకపోవడమే అని తెలుస్తోంది. పీపుల్స్ మీడియాకు చందు మొండేటి ఇంకా స్క్రిప్ట్ నెరేషన్ ఇవ్వలేదట. జస్ట్ లైన్ మాత్రమే చెప్పారని తెలుస్తోంది.


పైగా పీపుల్స్ మీడియా కూడా, పలు ప్రాజెక్టులతో బిజీగా వుంది. ఓ బేబీ, వెంకీమామ ఇలా వరుసగా సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. అందువల్ల నిఖిల్ -చందు మొండేటి సినిమా సెట్ మీదకు వెళ్లడానికి ఇంకా కొంచెం సమయం పడుతుందని రీసెంట్ న్యూస్. ఇక చందుమొండేటి దర్శకత్వం వహించిన సవ్యసాచి (నవంబర్ 2018) తరువాత చేస్తున్న సినిమా కార్తికేయ-2.  


మరింత సమాచారం తెలుసుకోండి: