సాయి తేజ్ రీసెంట్‌గా చిత్రలహరి సినిమాతో యావరేజ్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలంగా  హిట్ అనే పదానికి దూరంగా ఉన్న సాయి తేజ్ తన పేరును మోడిఫై చేసుకున్నాక ఈ హిట్ పడిందని ఫీలవుతున్నాడు. అందుకే తన నెక్స్ట్ సినిమాకు రెడీ అయ్యాడు. మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాకోసం నిన్నటిదాకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. అయితే అది ఒక కొలిక్కి వచ్చిందని లేటెస్ట్ న్యూస్. సుప్రీమ్ సినిమాలో పోటా పోటీగా నటించి, మెగాభిమానులకు కనువిందు చేసిన జోడీ సాయిధరమ్ తేజ్-రాశీఖన్నా. ఈ జోడీ మరోసారి స్క్రీన్ మీద సందడి చేయబోతోందట. 

ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఇప్పటికే అనేకానేక పేర్లు వినిపించాయి. నిన్న మొన్నటి వరకు ఎబిసిడి సినిమా హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ పేరు దాదాపు ఫైనల్ అయిందని కూడా ఒక వార్త ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేసింది. కానీ కాస్త నోటెడ్ హీరోయిన్ వుంటే బెటర్ అని ముందు నుంచి చిత్ర బృందానికి సలహాలు వినిపిస్తూనే వున్నాయి. ఎందుకంటే సాయిధరమ్ తేజ్ మార్కెట్ అంతంతమాత్రం. దానికితోడు నోటెడ్ హీరోయిన్ లేకుంటే, భారం అంతా డైరక్టర్ మారుతి మీదే పడుతుందని భావిస్తున్నారట. 

అందుకే రుక్సార్ పేరు ఫైనల్ లిస్ట్ లో అలావుంచి, మరోపక్క కాస్త రీజనబుల్ బడ్జెట్ లో ఎవరు దొరుకుతారా? అన్న వేట అలా సాగిస్తూనే వున్నారట. ఇందులో భాగంగానే రాశీఖన్నా అంటే 75లక్షల రేంజ్ లో వుంటుంది రెమ్యూనిరేషన్. ఇప్పుడు అదే విషయమైన చర్చలు సాగుతున్నట్లు సమాచారం. అవి ఒక కొలిక్కి వస్తే, తేజు-మారుతి సినిమాకు లేటెస్ట్ గా రాశీఖన్నా పేరు ఫైనల్ లిస్ట్ లోకి వస్తుంది. ఇదే గనక ఫైనల్ అయితే మరోసారి తేజు-రాశి ఖన్నా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: