సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి క్షణాల్లో వార్తలు అందరికీ తెలిసిపోతున్నాయి. తెలిసిన వార్తని అందరికీ చెప్పాలనే కుతూహలంతో అది నిజమో కాదో కూడా తెలుసుకోకుండా షేర్ చేసేస్తుంటారు. అదీ గాక ఆ విషయం సెలెబ్రిటీలకి సంబంధించినది అయితే ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రతీ ఒక్క సెలెబ్రిటీకి ఏదో ఒక సమయంలో ఎదురవుతుంది.

 

ఇక హీరోయిన్ కి సంబంధించిన విషయాలకైతే ఇంకా చెప్పేదేముంది. తాజాగా ఒక హీరోయిన్ కి కూడా ఇటువంటి సమస్యే ఎదురైంది.ఈ మధ్య తెలుగులో కనిపించడం బొత్తిగా మానేసిన రెజీనాకు ఈ నెల 13న నిశ్చితార్థం అయ్యిందంటూ ఓ ప్రముఖ నేషనల్ మీడియాలో రావడంతో ఇది నిజమే అనుకున్న అభిమానులు దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.

 

నిజానికి ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని సన్నిహితులు అంటున్నారు. రెజీనా నేరుగా మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఒకవేళ నిజం కాబట్టి  లేదేమోనని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ బిజీగా ఉండటమే అసలు రీజన్ అని ఫ్రెండ్స్ వెర్షన్.  చాలా కాలం తర్వాత రెజీనా తెలుగు సినిమాలో కనిపించింది గత వారం వచ్చిన "సెవెన్" సినిమాలోనే. కీలకమైన పాత్రే అయినప్పటికీ

కంటెంట్ మెప్పించేలా లేకపోవడంతో చేదు ఫలితం తప్పలేదు.

 

ప్రస్తుతం రెజీనా కోలీవడ్ లో చాలా  బిజీగా ఉంది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో గతంలో "నెంజమ్ మార్పత్తిలై" ఏవో కారణాల వల్ల విడుదల కాకుండా ఆగిపోయింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో "పార్టీ" -అరవింద్ స్వామితో "కల్లాపర్త్"-చింబు దేవన్ దర్శకత్వంలో "కసడా తపర "సినిమాలు చేస్తోంది. తెలుగుకు వస్తే అడవి శేష్ తో చేసిన క్రైమ్ థ్రిల్లర్ "ఎవరు" ఆగస్ట్ 23 న విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: