తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో నెంబర్ వన్ రేస్ లో వెళ్తుతుంది అక్కినేని సమంత..ఇప్పుడు బేబీ సమంత.  తాజాగా నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా 'ఓ బేబీ' రూపొందింది. సీనియర్ హీరోయిన్ లక్ష్మి .. రాజేంద్రప్రసాద్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.


ఈ మద్య సీనియర్ హీరోయిన్ల ఎక్కువ శాతం గ్లామర్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం నటనపైనే ఫోకస్ చేస్తున్నారు.  అనుష్క, నయనతార,కాజల్ ఇప్పుడు సమంత.  తాజాగా సమంత నటించిన ‘ఓ బేబీ’ మూవీ ప్రయోగాత్మక చిత్రంగానే చెప్పొచ్చు. సమంత రూపంలో పడుచు వయసు, లోపల వృద్ధురాలైన లక్ష్మి మనసు .. ఈ రెండింటి మధ్య జరిగే అల్లరిని అర్థం చేసుకోలేక బయటవాళ్లు పడే ఇబ్బందులతో ఈ ట్రైలర్ కొనసాగింది.


ఈ ట్రైలర్ లో నవ్వులు పూయిస్తూనే ఎమెషన్ కి గురయ్యే సన్నివేశాలు కనిపిస్తున్నాయి.  ఈ చిత్రంలో సినియర్ నటి లక్ష్మీ తో పాలు మరికొంత మంది సీనియర్ నటీనటులు ఉండటంతో ‘ఓ బేబీ’పై భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. చ్చేనెల 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో సమంతకి మరో హిట్ పడటం ఖాయమంటున్నారు అక్కినేని ఫ్యాన్స్  

మరింత సమాచారం తెలుసుకోండి: