బాలీవుడ్ క్రేజీ బ్యూటీ పరిణీతి చోప్రా అంటే ఆడియెన్స్ లో సూపర్ క్రేజ్ ఉంటుంది. చోప్రా సిస్టర్ గా పరిణీతి మొదటి సినిమా లేడీస్ వర్సెస్ రిక్కి బాల్ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ఇష్క్ జాదే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈమధ్య కెరియర్ లో కాస్త వెనుకపడినట్టు అనిపించినా మళ్లీ అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది.  


ప్రస్తుతం సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తున్న పరిణీతి చోప్రా అర్జున్ కపూర్ తో సందీప్ ఔర్ పింకి పరార్ సినిమా చేస్తుంది. అంతేకాదు మరో పక్క సిద్ధార్థ్ మల్హోత్రాతో జబ్రియా జోడీ సినిమాలో కూడా పరిణీతి నటిస్తుంది. రీసెంట్ గా నేహా ధూపియా చాట్ షోలో పాల్గొన్న పరిణీతి చోప్రా ఆ ఇద్దరు హీరోల మీద షాకింగ్ కామెంట్స్ చేసింది.     

ఇష్క్ జాదే సినిమాతో అర్జున్ కపూర్, పరిణీతి చోప్రాల జోడీ బాలీవుడ్ ఆడియెన్స్ ను భలే మెప్పించింది. సిద్ధార్త్ తో హసీ తో ఫసీ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఆ ఇద్దరు హీరోలతో రొమాన్స్ చేసింది పరిణీతి చోప్రా. అయితే ఇద్దరితో ఎవరితో ముద్దు పెట్టించుకోవడం ఇష్టమని అడిగింది నేహా ధూపియా. అందుకు సమాధానంగా అర్జున్ కపూర్ అని చెప్పింది పరిణీతి చోప్రా.   


తన కెరియర్ స్టార్టింగ్ డేస్ నుండి అర్జున్ మంచి స్నేహితుడని అందుకే అర్జున్ తో లిప్ లాక్ సీన్స్ నటించడం కంఫర్ట్ అని చెప్పింది పరిణీతి చోప్రా. తెలుగులో ఆర్.ఆర్.ఆర్ సినిమా ఛాన్స్ వచ్చిందని అప్పట్లో వార్తలు రాగా ఆ సినిమా గురించి తనను ఎవరు సంప్రదించలేదని చెప్పుకొచ్చింది. అందం అభినయం రెండు సమపాళ్లలో ఉన్న ఈ అమ్మడు సౌత్ సిని పశ్రమకు వస్తే కచ్చితంగా ఇక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: