ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం చాలా కష్టం అయిపోయింది. వారికి తగ్గ జోడీ కోసం వారితో సినిమాలు ఒప్పుకుంటున్న డైరెక్టర్లు తలపట్టుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో ప్రస్తుతం బాలయ్య బాబుతో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు బాలయ్య బాబు కోసం హీరోయిన్ ని ఎంపిక చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు సినిమా యూనిట్.


ఇక విషయంలోకి వెళితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ క్రమంలో బాలయ్య పక్కన హీరోయిన్ గా సమీరా రెడ్డి ని తీసుకోవాలని బాలయ్య బాబు సినిమా యూనిట్ కి తెలియజేసినట్లు ఫిలిం నగర్ టాక్. సమీరా రెడ్డి గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన అశోక్ సినిమాలో నటించింది తర్వాత మెగాస్టార్ చిరంజీవి పక్కన జై చిరంజీవి సినిమాలో నటించి తర్వాత ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం సమీరా రెడ్డి ప్రెగ్నెంట్. మరి కొద్ది నెలల్లో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది.


ఇటువంటి క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమీరారెడ్డి తాను సినిమా ఇండస్ట్రీకి దూరం కాలేదని అవకాశాలు వస్తే ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆమెని బాలయ్య సినిమాలో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సమీరా ఉన్న పరిస్థితిలో బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కనీసం మూడు, నాలుగు నెలలు రెస్ట్ తీసుకోవాల్సివుంటుంది. మరి ఏ విధంగా ఆమెని హీరోయిన్ గా కన్సిడర్ చేస్తున్నారనే విషయంలో క్లారిటీ లేదు. కానీ చిత్రబృందం నుండి ఆమె ఫోన్ వచ్చినట్లు.. కాల్షీట్స్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. మరోపక్క శ్రియా, మెహ్రీన్, తమన్నా లాంటి వారిని కూడా సంప్రదిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: