టెలివిజన్ రంగంలో ఎంతో నూతన ఒరవడి సృష్టించి..ఎన్నో రియాల్టీ షోలను కండెక్ట్ చేసిన మెయిల్ యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే.  ఈ మద్య ఎక్కువ సినిమాలు హర్రర్, కామెడీ నేపథ్యంలో వస్తు మంచి విజయాలు అందుకుంటున్నారు.  లారెన్స్ తీస్తున్న సినిమాలన్నీ ఈ నేపథ్యంలో వచ్చినవే..అవన్నీ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.

ఇటీవల కాంచన 3 సినిమాతో మరో ఘన విజయం అందుకున్నాడు లారెన్స్.  ఇక ఓంకార్ కూడా హర్రర్, కామెడీ తో పాటు మెసేజ్ కూడా ఇస్తున్నారు. ఆయన తెరకెక్కించిన ‘రాజుగారి గది’ కడుపుబ్బా నవ్విస్తూ..భయపెట్టింది. అంతే కాదు ఈ సినిమాలో ఆర్గాన్ డొనేషన్ పై ఎంతో మంచి సందేశం ఇచ్చారు.  ఇక నాగార్జున, సమంత ముఖ్య పాత్రలుగా ‘రాజుగారి గది 2’ సినిమాకూడా హర్రర్, కామెడీ తో పాటు ఇప్పటి యువత చేస్తున్న ర్యాగింగ్ పై మంచి సందేశాన్ని అందించారు. 

తాజాగా ఇప్పుడు రాజుగారి గది 3 కి సన్నద్దమవుతున్నారు. అంతే కాదు తమన్నాను ప్రధాన పాత్రధారిగా తీసుకుని 'రాజుగారి గది 3' చేయడానికి రంగంలోకి దిగారు. ఈ రోజు మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను జరుపుకుంది. దిల్ రాజు క్లాప్ ఇవ్వడంతో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. మన్నా జోడీగా అశ్విన్ బాబు కనిపించనున్నాడు. ఇటీవల హారర్ థ్రిల్లర్ సినిమాల్లో తమన్నా ఎక్కువగా నటిస్తున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: