తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఫృథ్వి ‘ఖడ్గం’చిత్రంలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడా అంటూ కొట్టే డైలాగ్ తో బాగా పాపులర అయ్యారు.  అప్పటి నుంచి  పేరడీ డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వస్తున్నారు.  ఇటీవల కాలంలో ఆయన ఎక్కువగా వైసీపీ పార్టీ తరుపు నుంచి మాట్లాడుతున్న విషయం తెలిసిందే.  అంతే కాదు వైసీపీలో ఆయన కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు.  


ఈ మద్య ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ జగన్ ని పట్టించుకోవడం లేదని..ఆయన అవసరం లేదా? అని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు.  అంతే కాదు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ ని కూడా టార్గెట్ చేసుకొని మాట్లాడటం..మెగా ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. 

అప్పటి నుంచి ఆయనపై చిత్ర పరిశ్రమ కోపంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. అంతే కాదు త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ నుండి పృధ్విని కావాలనే బయటకు పంపించారని, మెగా కుటుంబం మొత్తం ఆయనను తమ సినిమాల నుండి బహిష్కరించాలని నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి.


తాజాగా ఈ విషయంపై స్పందించిన కమెడియన్ ఫృథ్వి ఈ మద్య తనపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని..అవన్నీ ఒట్టి పుకార్లే అని అన్నారు.  ‘అత్తారింటికి దారేది” చిత్రం తరువాత త్రివిక్రమ్ నేను కలిసింది లేదు అన్నారు. అంతే కాదు  త్రివిక్రమ్-బన్నీ చిత్రంలో తనకు అసలు ఓ క్యారెక్టర్ ఉందన విషయమే తెలియనపుడు తనను ఎలా తొలగిస్తారో అస్సలు అర్థం కాలేదని అన్నారు.

పవన్ కళ్యాన్ కి నేను కూడా మంచి ఫ్యాన్ అని..ఆయనపై రాజకీయంగా మాట్లాడినంత మాత్రాన తప్పు కాదు కదా అని అన్నారు.  ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియదు అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: