జబర్ధస్త్ తో తన యాంకరింగ్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మి ఈ మద్య సోషల్ మాద్యమాలో తన కాంట్రవర్సీతో ఎన్నో సంచలనాలు సృస్టిస్తుంది. గతంలో జబర్దస్ లో నటుడు సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం కొనసాగిస్తుందని..త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. వాటిపై నెటిజన్లకు ఘాటుగా సమాధానం చెబుతూ..స్నేహం వేరు ప్రేమ వేరు, సుడిగాలి సుధీర్ తో తనకు స్నేహం మాత్రమే ఉందని, ఇక పెళ్లి సంగతి ఏంటీ? అంటూ ప్రశ్నించింది. అంతే కాదు అప్పుడప్పుడు సామాజిక విషయాల్లో కూడా రష్మీ చాలా ఘాటుగానే స్పందిస్తుంది.
తాజాగా తెలంగాణలోని వరంగల్ లో 9 నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే దుండగుడు అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రష్మి చాలా సీరియస్ గానే స్పందించింది. ‘నరేంద్ర మోదీ సార్.. మీరేమో బేటీ బచావో.. బేటీ పడావో అంటున్నారు. కానీ అమ్మాయిలే మిగలకుంటే, బేటీ బచావో.. బేటీ పడావో ఎలా సాధ్యమవుతుంది’ అని ప్రశ్నించింది.
ఇక్కడ మహిళలకే కాదు..చివరికి చిన్న అమ్మాయిలకు కూడా రక్షణ లేకుండా పోతుందని..కామంధులు పిచ్చి కుక్కల్లా రెచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి చంపిన నిందితుడు ప్రవీణ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.