తెలుగులో యాక్షన్, కామెడీ సినిమాలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన దర్శకుడు వి. వి. వినాయక్. ఆయన ప్రతీ సినిమాలో యాక్షన్ తో సమానంగా కామెడీ ఉంటుంది. సుమోలు గాలిలో లేవడం లాంటి సీన్లు వి.వి. వినాయక్ సినిమాల్లోనే చూస్తాం. అయితే ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించాడు. ఆ మధ్య వచ్చిన "ఖైదీ నంబర్ 150" సినిమా భారీ విజయం సాధించింది. చిరంజీవి తన 150 వ సినిమాకి ఏరికోరి వినాయక్ ని తీసుకున్నాడు.

 

అయితే ఈ సినిమా విజయం వినాయక్ ఖాతాలోకి రాలేదు. చిరంజీవి ఖాతాలోకి వెళ్లింది. ఆ సినిమా తర్వాత  సాయి ధరమ్ తేజ్ హీరోగా "ఇంటిలిజెంట్" సినిమా వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వం వహించబోయే తదుపరి సినిమాలో హీరో ఇతనే అంటూ బోలెడు పేర్లు బయటకు వచ్చాయి.

 

కానీ అందులో ఒక్క సినిమా కూడా పట్టాలెక్కలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా రాబోతున్నాడని తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయిపోయాయట.

 

అయితే గతంతో పోలిస్తే వి.వి.వినాయక్ ఇప్పుడు కొంచెం బరువు పెరిగినట్లు తెలుస్తోంది. కావాలనే ఈ సినిమా కోసం పెరిగినట్లు సమాచారం. అయితే ఇదే లుక్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక మరలా వినాయక్ బరువు తగ్గుతాడట. మిగిలిన సన్నివేశాల కోసం వినాయక్ సన్నగా కనిపించనున్నాడు అని టాక్. అందుకే ముందుగా లావుగా ఉన్నప్పటి సీన్లను చిత్రీకరించి, కొంత గ్యాప్ తర్వాత బరువు తగ్గి, షూటింగ్ పార్ట్ లో పాల్గొంటాడట వినాయక్.


మరింత సమాచారం తెలుసుకోండి: