బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ చిత్రాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన చిత్రాలు ప్రతి రంజాన్ పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తుంటారు. సల్మాన్ ఖాన్ ఏ చిత్రంలో నటించినా..ఆ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వర్క్ బాగా చేస్తుంటారు. ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ‘భారత్’ని ప్రమోట్ చేస్తూ వచ్చారు.
ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా 4700 థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేశారు. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న భారత్ వసూళ్లు కూడా భారీగానే సాధిస్తుంది.
తాజాగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.250 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇది సల్మాన్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన 6వ సినిమా కావడం విశేషం. అయితే ఈ విషయం స్పందించిన సల్మాన్ ఖాన్ ఈ విజయానికి కారకులైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.