తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన నిన్నటితరం హీరోయిన్లలో నిరోష ఒకరు.  స్టార్ హీరో, హీరోయిన్లు వారసులుగా వస్తున్న సమయంలో ప్రముఖ నటి రాథిక సోదరి నిరోష మొదటి సినిమా 1988లో మణిరత్నం రూపొందించిన ‘నట్చతిరం’ అనే సినిమాలో నటించింది.  తెలుగు ఘర్షణ మూవీగా రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాలో గ్లామర్ గా కనిపించిన నిరోషాకి వరుసగా తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో ఛాన్సులు వచ్చాయి. 

ఇటీవల టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన నిరోష వెండి తెరపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతుంది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిరోషా మాట్లాడుతూ..తన సినీ ప్రవేశం అనుకోకుండా జరిగిందని అన్నారు.  అక్క రాధిక నటన చూస్తూ ఎంతో నేర్చుకున్నానని..ఆమెతో కలిసి నటించడం అంటే నాకు ఇప్పటికీ భయమేస్తుందని అన్నారు. మొదటి నుంచి కూడా రాధిక కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండేది. నాకు సంబంధించిన ప్రతి విషయంలోను కేర్ తీసుకునేది.

ఆమెతో కలిసి సినిమాలు చేసేటప్పుడు సరిగ్గా చేయకపోతే సెట్లోనే తిట్టేసేది. అందువలన ఆ తరువాత ఆమెతో కలిసి సీరియల్స్ లో నటించడానికి కూడా భయపడ్డాను.  హీరో రాంకీని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది నిరోషా.  ఇప్పటి హీరోల్లో ఎన్టీఆర్ అంటే ఎక్కువ ఇష్టమని  నటన, డాన్స్, ఫైట్స్ అన్ని విషయాల్లో మెప్పిస్తాడని అందుకే అతని సినిమాలు ఎక్కువగా చూస్తానని అన్నారు నిరోషా.


మరింత సమాచారం తెలుసుకోండి: