హీరోయిన్లను టాలీవుడ్ లో క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఒక హీరోయిన్ ఒకే హీరోతో అనేక సినిమాలు చెయ్యొచ్చు. సీనియర్ హీరోలతో కూడా సినిమాలు చెయ్యొచ్చు. ఒకే ఫ్యామిలీలోని ఇద్దరు ముగ్గురు హీరోలతో కూడా సినిమాలు చెయ్యొచ్చు. తండ్రిహీరోగా చేసిన సినిమాలో హీరోయిన్ గా చేసి.. అలాగే కొడుకు హీరోగా చేసిన సినిమాలో కూడా హీరోయిన్ గా చేయడం అన్నది అరుదైన విషయం.
ఇలాంటి విషయాలు కొన్ని జరిగాయి. అవేంటో చూద్దాం. ఈ విషయంలో మొదటగా చెప్పుకోవాల్సింది శ్రీదేవి గురించి. శ్రీదేవి అప్పట్లో అక్కినేని నాగేశ్వర రావు సినిమాల్లో నటించింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు హిట్ కొట్టాయి. ఆ తరువాత నాగార్జున హీరోగా చేసిన ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా సినిమాలో హీరోయిన్ గా చేసింది.
ఈ లిస్ట్ లో తరువాత చెప్పుకోవలసిన హీరోయిన్ రాధా. రాధా అప్పట్లో క్రేజీ హీరోయిన్. నాగేశ్వర రావుతో ఆదర్శవంతుడు అనే సినిమాలో నటించిన ఈ హీరోయిన్... తరువాత నాగార్జునతో విక్కిదాదా సినిమాలో నటించింది. విజయశాంతి కూడా ఆ ఇద్దరి సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటె రీసెంట్ గా విషయాలను గురించి చెప్పుకుంటే..
కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ తో మగధీర సినిమా చేసింది.. ఆ తరువాత మెగాస్టార్ తో ఖైదీ నెంబర్ 150 చేసింది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం లో నటించింది.. ఇప్పుడు నాగార్జునతో మన్మధుడు 2 లో నటిస్తోంది. ఇప్పుడు తమన్నా..అప్పట్లో రామ్ చరణ్ తో రచ్చ చేసింది. ఇప్పుడు ఈ హీరోయిన్ మెగాస్టార్ తో సైరా సినిమా చేస్తోంది. సో, హీరోయిన్ గా క్రేజ్ ఉంటె ఇలా సినిమాలు చెయ్యొచ్చని అంటున్నారు విశ్లేషకులు.