అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవగా అఖిల్ ఈసారి మరింత ఫోకస్ పెట్టి బొమ్మరిల్లు భాస్కర్ సినిమా చేస్తున్నాడు.


భాస్కర్ కూడా డైరక్టర్ గా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసూకున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ ఈ నెల 26న మొదలు పెడతారట. ఫస్ట్ షెడ్యూల్ హీరోయిన్ అవసరం ఉండదట అందుకే హీరోయిన్ ను ఫైనల్ చేయలేదని తెలుస్తుంది.


హీరోయిన్స్ విషయంలో అఖిల్ కు ఎప్పుడూ డైలమాలో పడతాడు. స్టార్స్ తో చేసే రేంజ్ కాదు అందుకే కొత్త వాళ్లకే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. కాని ఈసారి అలా వర్క్ అవుట్ అవదని భావించి స్టార్ హీరోయిన్ కే ఎసరు పెట్టాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం పూజా హెగ్దె అఖిల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.


ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకున్న పూజా హెగ్దె ఓ పక్క త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు ప్రభాస్ జాన్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా చేస్తుంది. మొదట్లో ఫ్లాపులు అందుకున్న పూజా ఇప్పుడు స్టార్స్ సినిమాల్లో వరుస ఛాన్సులు కొట్టేస్తుంది. చూస్తుంటే టాలీవుడ్ టాప్ చెయిర్ అమ్మడి సొంతమయ్యేలా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: