ఇటీవల అన్నిక్రికెట్ ఫార్మాట్ లోకి గుడ్ భై చెప్పేసాడు ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్. అప్పట్లో 2011లో ఇండియా టీం కి వరల్డ్ కప్ రావడం లో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ కి యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ కి మధ్య గొడవ జరుగుతున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. కంగారుపడకండి ఇది నిజ జీవితంలో కాదు సినిమాలో. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.


ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా రజినీకాంత్ పక్కన మరో పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న మొట్టమొదటి సినిమా అయినా నేపద్యంలో ఈ సినిమాపై భీభత్సమైన అంచనాలు ఉన్నాయి.ఇలాంటి సందర్భంలో సందర్భంలో సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేలా ఓ వార్త బయటకు వచ్చింది.


ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఈ చిత్రంలో నటించబోతున్నారట. యోగ్ రాజ్ సింగ్ క్రికెటర్ గా తన కెరీర్ ని ప్రారంభించారు. ఆ తర్వాత నటుడిగా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.రజనీకాంత్ దర్భార్ చిత్రంలో ఓ ఫైట్ సన్నివేశంలో యోగ్ రాజ్ సింగ్ కనిపిస్తారని సమాచారం. అంటే ఆయన ఈ చిత్రంలో విలన్ కు చెందిన మనిషిగా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు సినిమా యూనిట్.



మరింత సమాచారం తెలుసుకోండి: