రాజకీయరంగంలో బిజెపి పార్టీ లో మోడీ అమిత్ షా తరువాత దేశ రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. పాలనలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ జాతీయ రాజకీయాలలో కీలకంగా మారుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ పై పంజాబ్ కు చెందిన ప్రముఖ సింగర్ హార్ద్ కౌర్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.


దీంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయడం జరిగింది. విషయంలోకి వెళితే హార్ద్ కౌర్ యోగి ఆదిత్య నాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై హార్ద్ కౌర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం యోగి ఆదిత్యనాధ్ ఒక రేప్ మ్యాన్. ఇకపై అతడిని అలాగే పిలవండి అంటూ హార్ద్ కౌర్ సోషల్ మీడియాలో కామెంట్ చేసింది.


ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉగ్రవాది అని, దేశంలో జరుగుతున్న పలు ఉగ్ర దాడులకు ఆర్ఎస్ఎస్ కారణం అంటూ హార్ద్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడులు, పుల్వామా అటాక్ కు కారణం ఆర్ఎస్ఎస్ అని పేర్కొంది. దీంతో ఈ వ్యాఖ్యలు విన్న ప్రముఖ న్యాయవాది మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్త శశాంక్ వారణాసిలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. హార్ద్ కౌర్‌పై సెక్షన్ 124 ఏ, 153 ఏ, 500 కింద కేసులు నమోదయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: