విలక్షణ నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న జెడి చక్రవర్తి ఆమధ్య దర్శకుడుగా మారి తనవంతు ప్రయత్నాలు చేసినా అవి కలిసిరాక తిరిగి యూటర్న్ తీసుకుని ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ హడావిడి చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈ విలక్షణ నటుడు వచ్చే వారం ప్రసారం కాబోతున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో అతిధిగా రాబోతున్నాడు. 

ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రచారం కోసం ప్రస్తుతం ఈటివి ప్రసారం చేస్తున్న ప్రోమోలో జెడి చక్రవర్తి తనను నాగార్జున ‘శివ’ షూటింగ్ సమయంలో కొట్టిన విషయాన్ని వివరించాడు. అప్పట్లో నాగార్జున చాల ఇగో తో ఉండేవాడన్న విషయాన్ని వివరిస్తూ ఒకసారి షూటింగ్ సమయంలో తాను ఎదో ఆలోచిస్తున్నప్పుడు తన చేయి నాగార్జునకు గట్టిగా తగిలితే అతడు వైల్డ్ గా రియాక్ట్ అయిన సందర్భాన్ని వివరించాడు. 

అయితే అప్పుడు తాను కూడ మరింత రెచ్చిపోయి ఆ సందర్భంలో నాగార్జున కాలర్ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లోని వర్కర్స్ తన తల పగల కొట్టడానికి రాడ్లను తీసుకువచ్చిన సందర్భాన్ని వివరిస్తూ ఆవిషయంలో తన గురువు రామ్ గోపాల్ వర్మ పడ్డ పాట్లను వివరించాడు. అయితే ఇప్పుడు నాగార్జున పూర్తిగా మారిపోయాడు అంటూ అలనాటి కోపం ఆవేశం నాగ్ లో బాగా తగ్గిపోయాయి అని జెడి కామెంట్ చేసాడు.

ప్రస్తుతం లేటెస్ట్ గా జెడి నటించిన ‘హిప్పీ’ మూవీ ఫెయిల్ అయిన నేపధ్యంలో ఆమూవీలో అతడు కష్టపడి నటించినా ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థుతులలో జెడి మళ్ళీ వర్మ సహకారంతో ఒక సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు అన్న వార్తలు కూడ వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రయత్నం అయినా జేడికి కలిసి వస్తుందేమో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: