బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తీసే సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాహుబలి సినిమా విజయంతో రాజమౌళి రేంజ్ పెరిగిపోయింది. తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసాడు. ఒక్కసారిగా ప్రపంచ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసాడు. మరి ఇంతటి విజయాన్ని అందుకున్న తర్వాత రాజమౌళి తన తర్వాతి చిత్రం ఎలా ఉంటుందని అందరూ ఎదురు చూసారు. రాజమౌళి తర్వాతి సినిమాలో మాకు ఓ ఛాన్స్ వస్తే బాగుండు అని అందరూ అనుకున్నారు.

 

రాజమౌళి తన తర్వాతి సినిమాని జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీ స్టారర్ తీయబోతున్నాడని అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఎన్టీఆర్ షూటీంగ్ లో పాల్గొంటున్నాడు. రామ్ చరణ్ కి సంబంధించి షూటింగ్ ఎప్పుడు ఉంటుందో ఇంకా తెలిసి రాలేదు. కొమరం భీం , అల్లూరి సీతారామరాజు పాత్రల్లో వీరిద్దరూ నటిస్తున్నారు.

 

ఇందులో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అయిన ఆలియా భట్ ని అనుకున్నారు. ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటీష్ భామ అయిన్ డైసి ఎర్గాన్ ని తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది. అప్పటి నుండి ఎన్టీఆర్ జోడీ గా ఎవరు నటిస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.  అయితే ఈ పాత్రకి విదేశీ భామనే కావాలని బాగా ట్రై చేశారట. కానీ ఎవరూ దొరక్కపోవడంతో కథని కొద్దిగా ఛేంజ్ చేసి ఆ పాత్రని భారతీయ భామతోనే చేయాలని ఫిక్స్ అయ్యారట.

 

ఆ పాత్రలో రాజమౌళి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ని అనుకున్నాడట. ఈ మేరకు ఆమెను కలువగా.. టాలీవుడ్ మొదటి సినిమా కాబట్టి తనకు వెయిట్ ఉండాలని కోరుకుంటున్నానని కానీ ఇందులో అంత స్కోప్ కనిపించడం లేదని నో చెప్పిందట. రాజమౌళి ఆఫర్ కాదనడం పట్ల అభిమానులు మండిపడుతున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: