కమర్షియల్ గా నాని కోరుకున్న భారీ సక్సస్ ‘జెర్సీ’ అందివ్వలేకపోయినా  నటుడిగా నానిస్థానాన్ని మరో మెట్టు ఎక్కించింది. తండ్రి కొడుకుల ఎమోషన్ ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఆవిష్కరించిన తీరు ఈ మూవీకి హైలెట్ గా మారింది.  ఈమూవీలో నాని కొడుకు   అడిగినందుకు ప్రాణాలు పణంగా పెట్టి క్రికెట్ ఆడి ప్రాణాలు పోగొట్టుకోవడం ఈ మూవీ కథలో హైలెట్.  

‘జెర్సీ’ లో కొడుకు తన నాన్నను కోరే కోరిక తరహాలో ఇప్పుడు దర్శకుడు వి.ఎన్. ఆదిత్యకు అలాంటి అనుభవమే తన కొడుకు నుండి ఎదురైనట్లు సమాచారం. ఇటీవలే ‘జెర్సీ’ సినిమా చూసిన దర్శకుడు  ఆదిత్య కొడుకు ‘నాన్న నువ్వెందుకు మళ్ళీ మూవీ తీయకూడదు’ అని అడిగాడట.  దీనితో  తాను ఏమి మిస్ అవుతున్నానో గుర్తించిన ఆదిత్య సోషల్ మీడియా ద్వారా త్వరలో తానూ ఒక మూవీ ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించాడు. 

ఆదిత్య కెరియర్ లో ‘మనసంతా నువ్వే లాంటి’ బ్లాక్ బస్టర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఆ తరువాత నాగార్జునతో తీసిన ‘నేనున్నాను’ మ్యూజికల్ సూపర్ హిట్ గా నిలిచింది. ఆపై సిద్దార్థ్ తో ‘ఆట’ ఉదయ్ కిరణ్ ‘శ్రీరామ్’ తీసినా అవి పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఈ దర్శకుడు తీసిన సినిమాలు అన్ని వరస పరాజయాలుగా మారడంతో ఇప్పడు ఈ దర్శకుడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. 

అయితే ఇప్పడు ఈ దర్శకుడు కొడుకు ‘జెర్సీ’ చూసిన ప్రభావంతో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక సినిమా తీయబోవడం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. అయితే ఇప్పడు ఆదిత్య వ్రాసిన కథను విని డేట్స్ ఇచ్చే హీరోలు పెట్టుబడి పెట్టి సాహసం చేయగల నిర్మాతలు ఎక్కడ ఉన్నారు అన్నదే సమాధానం లేని ప్రశ్న..  


మరింత సమాచారం తెలుసుకోండి: