బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలున్నాయి. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇద్దరు రియల్ హీరోస్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరి కథలతో వస్తుంది. ఒక్క హీరోతోనే సంచలనాలు సృష్టించే రాజమౌళి ఇద్దరు హీరోలతో చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ బాహుబలి కాదు అంతకుమించే సినిమా అవుతుందని చెప్పొచ్చు. 


ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటించే ఈ సినిమా లో ఇద్దరు ఎలా ఉండబోతున్నారు.. ఇద్దరు స్క్రీన్ పై ఒకేసారి కనిపించే సన్నివేశం ఎలా ఉంటుంది అన్నది ఆలోచిస్తున్నారు. సినిమా తీసేది రాజమౌళి కాబట్టి అభిమానుల అంచనాలకు తగినట్టుగా కాదు కాదు అంతకుమించేలా సినిమా ఉంటుందట. ఇక చరణ్, తారక్ ఎంట్రీ సీన్.. ఇద్దరు కలిసి కనిపించే సీన్ ఈ రెండు మాత్రం అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేలా ప్లాన్ చేశాడట.


బాహుబలితో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి తెలియచేసిన జక్కన్న. ఆర్.ఆర్.ఆర్ తో మరో అద్భుతాన్ని సృష్టిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా 3 వ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాలో అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.


సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేసిన రాజమౌళి ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైం కు సినిమా పూర్తి చేసేలా షెడ్యూల్ వేశాడట. తారక్, చరణ్ ఇద్దరి 10 నెలల డేట్స్ తీసుకున్నాడని తెలుస్తుంది. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ మరో అద్భుతమైన సినిమా అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: