సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి దాదాపుగా తెలియని తెలుగువాడు ఉండడనే చెప్పాలి. ఇక ఎప్పటికపుడు సమకాలీన విషయాలపై తనదైన స్టయిల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వర్మ, తన ముక్కుసూటితనంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి పార్టీ అద్భుత మెజారిటీతో గెలిచిన తరువాత ఆ పార్టీ వారి కంటే, వర్మ గారే ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వైసిపి విజయం తరువాత, ఇప్పటివరకు జగన్ పై అలానే వైసిపి పార్టీపై పొగడ్తల జల్లు కురిపిస్తున్న వర్మ, నేడు చంద్రబాబు నాయుడుపై పరోక్షంగా ఒక పంచ్ వేశారు. 

ఇప్పటికే కొన్నాళ్ల క్రితం తాను తీసిన లక్మిస్ ఎన్టీఆర్ సినిమాను టిడిపి వాళ్లు ఆంధ్రాలో విడుదల అవ్వకుండా ఆపడంతో వారిపై కొద్దిరోజులుగా పరోక్ష విమర్శలు చేస్తున్న వర్మ, నేడు ఒకరకంగా ఇండైరెక్ట్ గా చంద్రబాబుకు గట్టి పంచ్ వేశారు. అప్పట్లో టిడిపి అధినేత ఎన్టీఆర్ గారు విదేశాల్లో ఉన్న సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఏ విధంగా ఆ పార్టీ ఎమ్యెల్యేలను తన వైపునకు త్రిప్పుకున్నారో, ప్రస్తుతం అదే పరిస్థితి చంద్రబాబుకు ఎదురవుతోందని వర్మ తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ పంచ్ వేశారు. 

నిజానికి వైసిపి గెలుపు తరువాత ఎప్పటికపుడు ఏపీ రాజకీయ పరిస్థితులపై తనదైన స్టయిల్లో పోస్టులు పెడుతున్న వర్మ, నేడు చంద్రబాబును టార్గెట్ చేయడంతో కొందరు టీడీపీ అభిమానులు ఆయనపై సోషల్ మీడియాలో ఎదురుదాడికి దిగారు. ఇక ఏపీలో వైసిపి విజయం తరువాత తన తదుపరి సినిమా అదే అంశంపై ఉంటుందని, అలానే ఆ సినిమా పేరు 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' అని కూడా ప్రకటించేసారు వర్మ. ఇక ప్రస్తుతం చంద్రబాబును ఉద్దేశించి అయన పెట్టిన పోస్ట్, రాజకీయ వర్గాల తో పాటు, సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా విపరీతంగా చక్కర్లు కొడుతోంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: