తెలుగులో ఉర్రూతలూగించే సాంగ్స్ పాడాలంటే కొద్ది మందికే సాధ్యం, అలాంటి పాటలు పాడటంలో దిట్ట ప్రముఖ సింగర్ గీతా మాధురి. టీవిలో సాంగ్స్ కాంపిటీషన్ లో పాడి తన పవర్ ఏంటో చూపించి తర్వాత వెండి తెరపై ఎన్నో గీతాలు ఆలపించింది గీతామాధురి.  సాధారణంగా సింగర్స్ ఎక్కువగా ఎక్స్ పోజ్ కారు..చాలా తక్కువ మందికే ఆ క్రెడిట్ దక్కుతుంది.  అలాంటి వారిలో గీతామాధురి ఒకరు. 


అప్పుడప్పుడు వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది గీతామాధురి.  సినీ నటుడు నందు ని ప్రేమించి పెళ్లి చేసున్న గీతా మాదురి ఆ మద్య బిగ్ బాస్ 2 సీజన్ లో రన్నరప్ గా నిలిచింది.  అయితే బిగ్ బాస్ 2 లో గీతామాధురి పర్ఫామెన్స్ కి ఆడియన్స్ తెగ ఫిదా అయ్యారు.  అడవారు ఎందులోనూ తక్కువేం కాదు అన్నట్లు గీతామాధురి బిగ్ బాస్ 2 లో చివరి వరకు కౌశల్ కి  టాగ్గాఫ్ పోటీగా నిలిచింది. 


బిగ్ బాస్ షో తర్వాత గీత మాధురి పెద్దగా మీడియా ముందుకు రాలేదు. గీతా మాధురి, ప్రముఖ నటుడు నందు 2014లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.  ప్రస్తుతం గీత మాధురి సింగర్ గా రాణిస్తుండగా, నందు సినిమాల్లో నటిస్తున్నాడు. నందు, గీతా మాధురి దంపతులు తల్లిదండ్రులు కాబోతుండడంతో వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఇటీవలే గీతా మాధురి శ్రీమంతం కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. గీతా మాధురి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో 500పైగా పాటలు పాడారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: