అందాల నటి దివంగత శ్రీదేవి భర్త బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ బోనికపూర్ పై చీటింగ్ కేసు నమోదు అయినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. బోనీ కపూర్ తోపాటు మరికొందరిపై ప్రవీణ్ శ్యామ్ అనే వ్యక్తి కేసు నమోదైనట్లు సమాచారం. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరిట ప్రవీణ్ శ్యామ్ అనే వ్యక్తి పవన్ జంగిద్ అనే వ్యక్తి ని కలిసి బాలీవుడ్ క్రికెట్ లీగ్ నిర్మించబోతున్నట్లు..జరగబోయే మ్యాచుల్లో బోనీ కపూర్ తో పాటు చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు భాగస్వాములు అవుతారని ఇందులో చాలా మంది ప్రముఖులు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారని ఇదే క్రమంలో నీవు కూడా ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు రెట్టింపవుతాయి అని ప్రవీణ్ కు పవన్ జంగిద్ వివరించాడట.


అయితే పవన్ జంగిద్ కలిసిన కొన్ని రోజులకే బోనికపూర్ ఒక మీడియా సమావేశంలో జైపూర్ లో సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహించబోతున్నామని ప్రకటించారు. అయితే ఇది విన్న ప్రవీణ్ శ్యామ్తా 67 లక్షలు, తన స్నేహితుడు 32 లక్షలు అందుఓ పెట్టుబడిగా పెట్టలని నిర్ణయించుకుని పవన్ జంగిద్ కు ఆ మొత్తన్ని అందచేసారట.


అయితే ఇప్పటివరకు సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ మాత్రం నిర్వహించకపోవడంతో డబ్బు వాపస్ ఇచ్చేయాలని అడిగితే పవన్ జంగిద్ ఇవ్వడం లేదని ఎలాగైనా ఆ డబ్బులు వారితో ఇప్పించలని పోలీసులను ఆశ్రయించాడు ప్రవీణ్. బోణీకపూర్, పవన్ జంగిద్ మాటలు నమ్మే తాను డబ్బు ఇచ్చానని తనతో పాటు 2.5 కోట్ల రూపాయల మొత్తంలో మరికొందరు మోసపోయినట్లు ప్రవీణ్ ఆరోపిస్తున్నరు. దీంతో పోలీసులు ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తోపాటు పవన్ పై కూడా చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: