టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి పక్కన నటిస్తున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఇటీవల తన అందానికి గల రహస్యాన్ని బయట పెట్టింది. తన గ్లామర్ తో నవ్వుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న పూజా హెగ్డే ఇండస్ట్రీలో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. అంతేకాకుండా మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ పాస్టర్ కలెక్షన్లు సాధించిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసిన మహర్షి సినిమాలో మహేష్ పక్కన హీరోయిన్ గా నటించింది.


ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజా హెగ్డే తన అందమైన ఒక రహస్యం గురించి బయట పెట్టింది. చాలా మంది అమ్మాయిలకు కడుపునిండా అన్నం కంటినిండా కునుకు ఉంటే చాలా అందంగా చక్కగా కనిపిస్తారు . మొత్తం మీద గ్లామర్ గా కనిపించాలంటే నిద్ర తప్పనిసరి ఇది కన్ఫాం. కానీ పూజా హెగ్డే మాత్రం మరోలా అంటోంది. ‘నేను తక్కువ తిని, తక్కువ నిద్రపోతే అప్పుడు ఇంకాస్త అందంగా కనిపిస్తా’ అంటోంది.


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూజ మాట్లాడుతూ ‘‘సెట్లో ఉన్నప్పుడు ఆకలి, నిద్ర.. వీటి గురించి అస్సలు పట్టించుకోను. ఉదయం ఏడింటికి సెట్కి వెళ్లి, అర్ధరాత్రి రెండింటి వరకూ పని చేసిన రోజులున్నాయి. ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని చెబుతుంటారు. కానీ నేను గంట సేపు కూడా నిద్రపోని సందర్భాలున్నాయి. మహా అయితే రోజుకి నాలుగు గంటలు పడుకుంటా. నిద్ర లేకపోయినా సరే… మరుసటి రోజు ఎలాంటి అలసట నాలో కనిపించదు. దానంతటికీ కారణం పనిపై నాకున్న ప్రేమే. జయాపజయాలతో సంబంధం లేకుండా నా వృత్తిని నేను గౌరవిస్తాను. ఆ గౌరవమే నన్ను నడిపిస్తోంద’’ని చెప్పింది.



మరింత సమాచారం తెలుసుకోండి: