సెలెబ్రిటీలు ఏది చేసినా వార్తే అవుతుంది. వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులని బట్టి వాళ్ళేం చేస్తున్నారో తెలుసుకోవచ్చు. సెలెబ్రిటీలు కూడా ఏ విషయమైనా అభిమానులతో పంచుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో జరిగే ఇంట్రెస్టింగ్ విషయాల్ని పోస్ట్ చేస్తూ నెటిజన్లకు దగ్గరవుతున్నారు.


ఈ విధంగా తెలుగు గాయని " గీతా మాధురి " ఈ మధ్య పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. గత ఏడాది జరిగిన బిగ్ బాస్ 2 షో లో గీతా మాధురి రన్నరప్ గా నిలిచింది.  బిగ్ బాస్ షో తర్వాత గీత మాధురి పెద్దగా మీడియా ముందుకు రాలేదు.  గీతా మాధురి, ప్రముఖ నటుడు నందు 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  వీరిది ప్రేమ వివాహం. గీతా మాధురి ఎక్కువగా ఐటెం సాంగ్స్ పాడింది. తన హస్కీ వాయిస్ తో పాటకే కొత్త అందం తెస్తుంది.

 

గీత మాధురి సింగర్ గా రాణిస్తుండగా, నందు సినిమాల్లో నటిస్తున్నాడు. బిగ్ బాస్ షో లో కౌశల్ కు గట్టి పోటీ ఇచ్చింది గీతా మాధురి మాత్రమే. ఓ దశలో గీతా మాదిరి విజేత అంటూ ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు గీతా మాధురి రన్నరప్ తో సరిపెట్టుకుంది. అయినా కూడా బుల్లితెర మీద చాలా మంది అభిమానులనే సంపాదించుకుంది.

 

ఇదిలా ఉండగా నందు, గీతా మాధురి దంపతులు తల్లిదండ్రులు కాబోతుండడంతో వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఇటీవలే గీతా మాధురి శ్రీమంతం కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గీతా మాధురి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో 500పైగా పాటలు పాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: