తాజాగా నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో శ్రీ రెడ్డి... విశాల్ను టార్గెట్ చేస్తూ అటాక్ చేయడం తమిళ సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా శ్రీరెడ్డి హీరో విశాల్ పై మరోసారి తనదైన శైలిలో విరుచుకు పడింది.
అంతేకాదు శ్రీరెడ్డి, విశాల్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. విశాల్ అమ్మాయిలను వాడుకొని వదిలేసే రకం అని వ్యాఖ్యానించింది. ఆయన క్యారవాన్లో జరిగేవన్నీ రాసలీలలే అంటూ విమర్శలకు దిగింది.
విశాల్ నిజమైన క్యారెక్టర్కు సంబంధించిన ఆధారాలు తన వద్ద వున్నాయని, త్వరలోనే వెల్లడిస్తానని శ్రీరెడ్డి ఆరోపణలు గుప్పించింది. అంతేకాకుండా సామాన్య జనాలు భయపడే ఏవేవో అనరాని అసభ్య పదజాలంతో విరుచుకు పడింది. ఈ వ్యాఖ్యలతో తమిళ సినీ ప్రపంచం షాక్ లో పడింది.
తాను రెడ్డి అయినంత మాత్రాన రెడ్డిలకు సపోర్ట్ చెయ్యనని చెప్పింది శ్రీరెడ్డి. ఆడవాళ్లను ఏడిపించే వాళ్లను అసలు ఒదలను అంటూ బూతులతో కామెంట్స్ చేసింది.ప్రస్తుతం కోలీవుడ్లో నడిగర సంఘం ఎన్నికలకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్లో ఉంది.