సినిమా రంగంలోనే కాదు ఏ రంగంలో అయినా మన ఇష్టాఇష్టాలను బట్టి ప్రవర్తించడం అన్నింటా కలిసిరాదు అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఏ మాత్రం ప్రక్కవారిని పట్టించుకోకుండా ముక్కుసూటినంగా వ్యవహరించడం వలన, మనకు మేలు ఎంతవరకు జరుగుతుందో తెలియదుగాని కీడు మాత్రం తప్పకుండా కొంత జరుగుతుంది అనే చెప్పాలి. అయితే ఆ విధంగా జరుగడంలో సినీ రంగం కూడా అతీతం కాదనే చెప్పాలి. ఇక ఒకరకంగా చెప్పాలంటే సినీనటులకు కూడా తమకు స్వఇష్టాలు ఉన్నప్పటికీ, అవి బయటపెట్టకుండా అందరిని కలుపుకు పోతేనేకాని భవిష్యత్తులో ముందుకుసాగలేరు అనేది అక్కడివారు ఎక్కువగా చెప్పేమాట. 

అయితే ఆ విధంగా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహమాటం లేకుండా మాట్లాడే అతికొద్దిమంది సినిమా నటుల్లో పోసాని కృష్ణ మురళి కూడా ఒకరు అనే చెప్పాలి. ప్రస్తుతం అనారోగ్యకరణంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పోసాని, మెల్లగా కోలుకుంటున్నారు. ఇక ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ, ఎవరి ఇష్టాల ప్రకారం వాళ్ళం తమకు నచ్చిన వారి గురించి మాట్లాడుతాం అండి, కాకపోతే అది అందరికి రుచించదు. తన ముక్కుసూటితనం అలానే రాజకీయాల్లో తాను వైఎస్ జగన్ గారికి ఎప్పటినుండో మద్దతు ఇస్తుండడం వలన తనకు ఇటీవల కొన్నాళ్లుగా సినిమా అవకాశాలు తగ్గాయని అయన అన్నారట. 

అంతేకాక ఇటీవల ప్రారంభమైన ఒక బడా హీరో పెద్ద సినిమాలో తనకు అవకాశం వచ్చిందని, అయితే తాను జగన్ సపోర్టర్ ని తెలిసి, కావాలని కొందరు ఆ సినిమా నుండి తన పాత్రను తీసేయించారని అయన అన్నట్లు సమాచారం. అయితే ఆ సినిమా నిర్మాత మరియు హీరో ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు. ఇదిగో, అప్పుడు పోసాని పలికిని ఈ మాటలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లోనే కాక, మీడియా మాధ్యమాల్లో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరిది ఆ సినిమా అంటూ పలువురు నెటిజన్లు తమలో తాము చర్చించుకుంటూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: