టాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం ప్రస్తుతకాలంలో పరిపాటి అయిపోయిందని చెప్పాలి. ఇక  స్టార్ హీరోల సినిమాల్లో ప్రస్తుతం అక్కడక్కడా కొందరు బాలీవుడ్ భామలు నటిస్తూనే ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ సాహోలో అయన సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక తన గత సినిమాలైన వన్ నేనొక్కడినే లో కృతి సనన్, అలానే భరత్ అనే నేనులో కియారా అద్వానీ వంటి బాలీవుడ్ భామలను తీసుకున్న మహేష్, మరొక్కసారి బాలీవుడ్ హీరోయిన్ తో జతకట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సాహోలో నటిస్తున్న శ్రద్ధ కపూర్ ని అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో తాను తీయబోయే సినిమాలో నటింపజేయాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నారట. నిజానికి ఇదివరకు ఒకసారి సూపర్ స్టార్ తో నటించే అవకాశం శ్రద్ధకు లభించినప్పటికీ, అది అనుకోకండా కుదరలేదని తెలుస్తోంది. 

ఇకపోతే ఆ సినిమాను కూడా హారిక హాసిని సంస్థే నిర్మిస్తుందని అంటున్నారు. గతంలో వలే, త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే మంచి ఎంటర్టైన్మెంట్ మరియు కామెడీ అంశాలు మెండుగా ఉండే ఈ సినిమాతో మరొక్కసారి త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ అదిరిపోతుందని, ఇక వారితోపాటు శ్రద్ధ గ్లామర్ కూడా సినిమాకు బాగా కలిసొస్తుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మహేష్, త్రివిక్రమ్, శ్రద్ధ కపూర్ కాంబినేషన్లో టాలీవుడ్ కు మరొక హిట్ మూవీ లభించినట్లే...!!


మరింత సమాచారం తెలుసుకోండి: