చంద్రశేఖర్ యేలేటి తీసిన సినిమాలు చాలా తక్కువ. ఐతే సినిమాతో డైరెక్టరైన చంద్రశేఖర్ అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం, సాహసం వంటి సినిమాలను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలు కమర్షియల్ సక్సస్ ను  అందుకోలేకపోయినప్పటికి విమర్శకుల నుండి ప్రశంసలు మాత్రం అందుకున్నారు.  డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు రూపొందించడమే యేలేటి స్పెషాలిటీ. 6 పాటలు, 4 ఫైట్లు ఉండాలని ఆయన నియమమేమీ పెట్టుకోరు. అదే ఆయనకు పెద్ద మైనస్ అని కూడా ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే నిర్మాతకి కావాల్సిందల్ల డబ్బులు. హీరోస్‌కి కావల్సిందల్లా హిట్. ఇవి రెండు రానప్పుడు ఏ నిర్మాతైనా, ఏ హీరో అయినా ఒక డైరెక్టర్ కి డేట్స్ కాదు కదా కథ వినడానికి టైం కూడా ఇవ్వరు. అందుకే ఆయన చివరి సినిమా 'మనమంతా' కూడా మంచి రేటింగ్స్ తెచ్చుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం చతికిలబడింది. 


అప్పటి నుంచి యేలేటి తన కొత్త సినిమా కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇంతవరకూ ఫైనల్ కాలేదు. ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్ కి ఇది పెద్ద అవమానమే అని చెప్పక తప్పదు. మెగా హీరో సాయి తేజ్ తో సినిమా చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి.  ఈ కాంబినేషన్ కుదరకపోవడంతో సేమ్ స్క్రిప్ట్ నితిన్ దగ్గరకు వెళ్లిందని.. ఇక సినిమా వెంటనే మొదలవుతుందని అన్నారు.  కానీ నితిన్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా వెనక్కు వెళ్ళింది.  నితిన్ తో కుదరకపోవడంతో యేలేటి ఒక లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ తో శ్రియ శరణ్ ను ఒప్పించాడని ఫిలిం నగర్‌లో ప్రచారం జరిగింది. 


అయితే ఈ ప్రాజెక్టు కూడా సెట్ కాలేదని సమాచారం.  చివరికి న్యాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే అవకాశం యేలేటికి వచ్చిందని లేటెస్ట్ న్యూస్. ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తారని సమాచారం. నాని ప్రస్తుతం నటిస్తున్న 'గ్యాంగ్ లీడర్' పూర్తి కాగానే యేలేటి సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట.  ఈ సినిమా థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతుందని ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కితే మాత్రం యేలేటి నిరీక్షణ ఫలించినట్టేనని ఫిల్మ్ నగర్  లోచెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: