రూ.5 కోట్ల అప్పు కట్టకపోవడంతో ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. 'ఆండాళ్ అళగర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్' పేరుతో విజయ్ కాంత్ ఓ సంస్థను నడిపిస్తున్నారు. దీనిపేరు మీద ఐదు కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. అయితే బ్యాంక్ వరు ఎంత సమయం ఇచ్చినా విజయ్ కాంత్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతోనే ఈ ఆస్తులు వేలం వేస్తున్నట్లు సమాచారం.
అయితే ఆస్తుల వేలానికి పర్మిషన్ ఇస్తూ.. విజయ్ కాంత్, అతడి భార్య ప్రేమలతా సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం ప్రకటన చూసిన అభిమానులు కొందరు విజయ్ ఆస్తులను దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. సినిమాల్లో నటిస్తూనే విజయ్ కాంత్ 'డిఎండికె' అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ మద్య జరిగిన ఎన్నికల్లో 'డిఎండికె' చిత్తుగా ఓడిపోయింది.