ప్రముఖ ప్రొడ్యూసర్ డి సురేష్ బాబు తనయుడు రానా దగ్గుబాటి ‘లీడర్’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా రాజకీయ నేపథ్యంలో కొనసాగినా..తర్వాత హీరోగా తన స్థాయిని నిలబెట్టుకోవడానికి రానా ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇదే సమయంలో కేవలం హీరోయిజం ఉన్నపాత్రలే కాదు, ఎలాంటి పాత్రలైనా నటించడానికి సిద్దపడ్డారు రానా. తెలుగు లోనే కాదు అతి తక్కువ కాలంలో బాలీవుడ్ లో సైతం తన సత్తా చాటుతూ వచ్చాడు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 లో భళ్లాలదేవుడిగా నటించి మెప్పించాడు. బాహుబలి గా నటించిన ప్రభాస్ కి ధీటుగా రానా విలన్ గా నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. తాజాగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా 'విరాటపర్వం' రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాలో రానా .. సాయిపల్లవి పాత్రలు ఎలా వుంటాయనే ఆసక్తి కూడా అభిమానుల్లో పెరిగిపోతోంది.
అయితే ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించబోతున్నాడట. జర్నలిస్ట్ పాత్రలో సాయిపల్లవి కనిపించనుందని అంటున్నారు. నక్సలైట్ గా అజ్ఞాతంలో వున్న రానాను జర్నలిస్ట్ గా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన సాయిపల్లవి అతడి ప్రేమలో పడిపోతుందట. ఆ తర్వతా సినిమాలో ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది సినిమాలో చూపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.