అలనాటి నటీమణులతో ఇపుడు ఎవరినీ పోల్చడానికి లేదు. వారు నటనలో జీవించారు. ప్రాణం పెట్టి పాత్రలు పోషించారు. అలనాటి చిత్రాలు ఇపుడు టీవీలో వస్తూంటే వారి అభినయానికి జోహార్ అనాల్సిందే. అద్భుతమైన నటన వారి సొంతం. అసలు వారు పుట్టింది అటువంటి పాత్రలను పోషించి ప్రేక్షకులను తరింపచేయడానికేనా అనిపీస్తుంది.


అలాంటి నటీమణులలో అగ్రే శ్రేణి నటీమణి వాణిశ్రీ. ఆమె రంగుల రాటం చిత్రంతో తెలుగు చలన చిత్ర ప్రవేశం చేసి అనేక సినిమాల్లో సహాయ పాత్రలు చేశారు. ఆ తరువాత ఆ తరం అగ్ర నటులు నందమూరి, అక్కినేని, క్రిష్ణ, శోభన్ బాబు సరసన ఎన్నో  జనరంకమైన పాత్రల్లో నటించి మెప్పించారు. వాణిశ్రీ సినిమాలో ఉందంటే ఆ పాత్రకు ఎంతో విలువ ఉందని అనుకునే రోజులవి.


అటువంటి వాణిశ్రీ థరిడ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇపుడు ఆమె ఏకంగా  బుల్లి తెర మీదకే దూసుకువస్తున్నారు. మన నట్టింటికే ఆమె వస్తున్నారు. వాణిశ్రీ ప్రధాన పాత్రలో ప్రేమనగర్ పేరు మీద టీవీ సీరియల్ ప్రముఖ టీవీ చానల్ ఈటీవీలో ప్రసారం కాబోతొంది. ఈ సీరియల్ కోసం మహిళాలోకం యావత్తు ఎదురుచూస్తోంది. అలాగే నాటి యువతరం, నేటి సీనియర్ సిటిజన్స్ గా మారిన వారు కూడా ఈ సీరియల్ ను చూసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఒకనాటి టాప్ రేంజి హీరోయిన్ టీవీ తెరపై కనిపించడం ఓ సంచలనమే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: