హైదరాబాదులో కుండపోతగా వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయం అవడం తో ట్రాఫిక్ లో ఇరుక్కుని పోయాడు యంగ్ హీరో నితిన్. ఎంతసేపటికి వర్షం ఆగకపోవడం మరోపక్క ట్రాఫిక్ జాం ఫుల్లుగా అవ్వడంతో రోడ్లన్నీ కారు డ్రైవర్ కి అప్పజెప్పి నితిన్ దగ్గర్లోని మెట్రో స్టేషన్ కు వెళ్ళాడు. మైట్రో రైల్ లో ప్రయాణించడం ద్వారా నితిన్ త్వరగా తన గమ్యాన్ని చేరుకున్నాడు.


మెట్రో స్టేషన్ లో, మెట్రో రైలులో నితిన్ అభిమానులతో తీసుకున్న సెల్ఫీలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో స్టేషన్ లో ఉన్న చాలామంది నితిన్ తో ఫోటో దిగడానికి ఎగబడ్డారు. ఒక పక్క వర్షం మరో పక్క అభిమానుల అరుపులతో నితిన్ కూడా వాళ్లతో కలిసి ఎంజాయ్ చేశారు. మొత్తం మీద వెండితెరపై ఉండే హీరో ఒక్కసారిగా జనం మధ్యకు రావడంతో చాలామంది నితిన్ సింప్లిసిటీకి ఫిదా అయిపోతున్నారు.


మరోపక్క నితిన్ పవన్ కళ్యాణ్ అభిమాని అవడంతో...పవన్ కి తగ్గ అభిమాని అని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో నితిన్ చేసిన పోస్ట్ కి కామెంట్లు పెడుతున్నారు. నితిన్ ప్రస్తుతం భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.  

 



మరింత సమాచారం తెలుసుకోండి: