గరుడ వేగ సినిమా తర్వాత రాజశేఖర్ హీరీ గా చేస్తున్న చిత్రం "కల్కి" గరుడవేగ " హిట్ తర్వాత ఆంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ మంచి జోష్ మీదున్నాడు.  విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన " అ!" సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాజశేఖర్ కి జోడీ గా ఆదా శర్మ నటిస్తుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ కనిపించనున్నారు.

 

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో తెరెకెక్కిన ఈ చిత్రం ఈ నెల 28 వ తేదీ న విడుదల అవుతుంది అని ప్రకటించారు. అయితే విడదలకు ముందు ఈ సినిమా చిక్కుల్లో పడే విధంగా ఉంది. ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజశేఖర్ మరో హిట్ కొట్టబోతున్నాడని అనుకుంటున్నారు. అయితే తాజాగా ఒక వార్త ఈ సినిమా విడుదలను ఆపుతుందేమోనని భయపడుతున్నారు.

 

కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత ఈ కథ తనదేనని చెబుతున్నాడు. 'మహంకాళి' సినిమా సమయంలో నేను రాజశేఖర్ కి 'కల్కి' టైటిల్ తో కథ చెప్పాను .. స్క్రిప్ట్ కూడా ఇచ్చేశాను. ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ ఎక్కువవుతుంది, ఇప్పుడు అంత పెట్టలేం' అని రాజశేఖర్ అన్నారు. దాంతో నేను వేరే ప్రయత్నాల్లో ఉండిపోయాను. ఇప్పుడు అదే కథకి కొన్ని మార్పులు చేసి తీశారు.

 

ఈ విషయంపై రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాను. అసోసియేషన్ కమిటీ సభ్యులు 'కల్కి' యూనిట్ ను చర్చలకు పిలిస్తే రావడం లేదు. 'కల్కి' యూనిట్ నుంచి నేను డబ్బులు ఆశించడం లేదు .. క్రెడిట్ ఇస్తే చాలు" అని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా మీద ఉన్న ఈ వివాదం పోయి విడుదల అవుతుందో లేదో చూడాలి. సినిమా రిలీజ్ కి దగ్గర అవుతున్న సమయంలో ఈ వివాదం రావడం చిత్ర యూనిట్ ని ఆందోళనకి గురి చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: