సంచలన దర్శకుడిగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ మొదటినుండి కొన్ని సినిమాలు లేదా ఏవైనా ఇతర అంశాల గురించి మాట్లాడడం మనం ఇదివరకు చాలాసార్లు చూసాం. అయితే కొన్నాళ్ల నుండి అయన ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై ఎప్పటికపుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తనదైన రీతిలో సెటైరికల్ గా పోస్టులు పెడుతున్నారు. 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తరువాత సీఎం జగన్ మోహన్ రెడ్డిగారికి తన తరపున ధన్యవాదాలు తెల్పుతూ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని విజయం సాంగ్ ని జగన్ ఫొటోలతో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల తాను తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అప్పట్లో ఏపీలో విడుదల చేయకుండా ఆపడంతో, అప్పటి అధికార టీడీపీ పార్టీపై వర్మ పరోక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల నుండి చంద్రబాబు అలానే టిడిపిపై వర్మ ఏదో ఒక వ్యంగ్య పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఇక కాసేపటి క్రితం తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక వ్యక్తి చంద్రబాబు సింహం, అయన మౌనంగా ఉన్నాడంటే అది అసమర్ధత కాదు, ఆ మౌనం వెనుక ఎంతో శక్తీ ఉంది, జై చంద్రబాబు అని పెట్టిన వీడియోని ట్యాగ్ చేసిన వర్మ, 

ఇటువంటి పిచ్చిపట్టిన చంద్రబాబు గారి సామజికవర్గానికి చెందిన వ్యక్తులే ఇప్పుడు అయన స్థాయిని తక్కువ చేస్తున్నారు అంటూ పోస్ట్ చేసారు. అయితే ఈ వరుస పోస్టులతో వర్మ చంద్రబాబును బాగా టార్గెట్ చేసారు అని మనకు అర్ధం అవుతుంది. అయితే వర్మ పోస్టులపై కొందరు విరుచుకుపడుతుంటే మరికొందరు మాత్రం ఆయనను సమర్ధిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా వర్మ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తోంది....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: