ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ కాలేశ్వరం ప్రాజెక్ట్ అని ఇటీవల కేసీఆర్ సర్కార్ ప్రారంభించడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ అని చేపట్టి పూర్తి చేయడం జరిగింది. దీంతో ఇటీవల ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు కెసిఆర్.


ఈ నేపథ్యంలో మహేష్ బాబు.. చాలామంది ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కొనియాడుతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ' విప్లవాత్మక అద్భుతం.. తెలంగాణ ప్రజలు గర్వంగా భావించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో కాలేశ్వరం ప్రాజెక్ట్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి కెసిఆర్ పై అలాగే కేటీఆర్ పై సోషల్ మీడియాలో మహేష్ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించిన ఇంజనీర్లకు హ్యాట్సాఫ్' అంటూ మహేష్ బాబు ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు.


ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సరిలేరు నీకెవ్వరు అనే సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు సీనియర్ హీరోయిన్ విజయశాంతి కూడా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.







మరింత సమాచారం తెలుసుకోండి: